విశాఖ పోర్టును మించిన.. పారాదీప్
ఒకప్పుడు తూర్పు కోస్తా రైల్వేకు వాల్తేరు డివిజన్ ద్వారానే భారీ ఆదాయం సమకూరేది. అయితే, గత మూడేళ్లలో పారాదీప్ పోర్టు వల్ల ఖుర్దారోడ్ డివిజన్కు భారీగా ఆదాయం సమకూరుతోంది. రానున్న కాలంలో ఒడిశాలో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పనున్న నేపథ్యంలో రైల్వేకు మరింత ఆదాయం లభించే అవకాశాలున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. గత ఆర్థిక సంవత్సరాల్లో తూర్పు కోస్తా రైల్వే సాధించిన ప్రగతిని పరిశీలిస్తే..
* 2013-14 సంవత్సరంలో వాల్తేరు డివిజన్కు రూ.6,266.43 కోట్లు ఆదాయం వస్తే.. ఖుర్దారోడ్ డివిజన్కు రూ.6,6814.4 కోట్లు వచ్చింది.
*...
more... రైల్వే బోర్డు కమిటీ సంప్రదింపులు మొదలుపెట్టక ముందు నుంచే ఖుర్దారోడ్ డివిజన్ సుమారు 414.97 కోట్లతో లాభాల్లో ఉంది.
* అయినప్పటికీ.. వాల్తేరు డివిజన్ను కోల్పొతే తూర్పు కోస్తా రైల్వే జోన్కు ఉనికే ఉండదనే వాదనను అక్కడి ప్రజా ప్రతినిధులు, తూ.కో.రైల్వే యంత్రాంగం బలంగా వినిపించింది.
* భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న తూ.కో.రైల్వే ఉనికి కోల్పోయి వేరొక జోన్లో విలీనం కావాల్సిన పరిస్థితి నెలకొంటుందనే వాదన కమిటీకి వినిపించినట్లు తెలిసింది.
* అయితే, కమిటీ వాల్తేరు డివిజన్, తూ.కో.రైల్వే నుంచి రికార్డులను తెప్పించుకుని పైపైనే నివేదికను తయారుచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
* దీన్ని ఆధారంగా తీసుకుని కేంద్రం నిర్ణయం ప్రకటిస్తే విశాఖ తీవ్రంగా నష్టపోతుందని వాల్తేరు డివిజన్ రైల్వే ఉద్యోగులు వాపోతున్నారు.
* ఇప్పటికే నగరవాసుల్లో రైల్వేజోన్ విశాఖలోనే ఏర్పాటు చేస్తారనే నమ్మకం బలంగా నాటుకుపోయింది. సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన భాజపా ఎంపీ ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖకు ఆ భాగ్యం దక్కకపోతే, అంతకన్నా దురదృష్టం మరొకటి లేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
ఆదాయం.. వనరులున్నా..
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ డిమాండ్కు బలం పెరిగిన సంగతి తెలిసిందే.
* 2014-15లో తూర్పు కోస్తా రైల్వే ఆదాయాన్ని పరిశీలిస్తే.. 12.4 శాతం వృద్ధితో రూ.13881.55 కోట్లు సాధించింది. వాల్తేరు డివిజన్ రూ.6653.31 కోట్లు, మిగతా సగం ఖుర్దారోడ్ డివిజన్ నుంచి వచ్చింది..
* సంబల్పూర్ డివిజన్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంది. దీంతో, వాల్తేరు డివిజన్పై కేంద్రం నిర్ణయం ఎలా ఉన్నా.. ఒడిశాలో రైల్వే అభివృద్ధికి రూ.5వేల కోట్లు కేటాయించాలని అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లేఖ రాశారు.
* దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించి రైల్వే బడ్జెట్లో తగిన నిధులను కూడా కేటాయించింది.
* దేశంలో ఇతర డివిజన్లతో పోల్చితే ఖుర్దారోడ్ డివిజన్ ఆదాయంలో ముందున్నది. దీని పరిధిలో ఉన్న పారాదీప్ నుంచి ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా పెరిగాయి.
* 2014-15లోని సరకు రవాణా వాటాను పరిశీలిస్తే.. పారాదీప్ పోర్టు ఔట్వార్డు(వెళ్లే సరకు) 32 శాతం, విశాఖ పోర్టుకు 31 శాతం ఉంది. ఇన్వర్డ్(వచ్చే సరకు) పారాదీప్ పోర్టుకు 66 శాతం, విశాఖ పోర్టుకు 31 శాతం ఉంది.
* ఒడిశాలో విద్యుత్తు ప్లాంట్లు పెరగడం వల్ల బొగ్గుకు డిమాండు పెరిగింది. అలాగే, అక్కడ ఉన్న మహానది కోల్ ఫీల్డ్ బొగ్గు ఎగుమతుల వల్ల కూడా మంచి ఆదాయం తూ.కో.రైల్వేకు సమకూరుతోంది.
* కేకే, కేఆర్ లైన్లకు మావోయిస్టుల చర్యల వల్ల కలుగుతోన్న ఇబ్బందులు, ముడి ఇనుము సరకు రవాణా తగ్గుముఖం పట్టడం వంటి ప్రతికూల ప్రభావాల మధ్య కూడా వాల్తేరు ఆదాయం స్థిరంగా కొనసాగుతుండటం గమనార్హం.
విశాఖ లేదా.. అమరావతి
అమరావతి కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలనే ప్రతిపాదన కూడా కేంద్రానికి అందినట్లు తెలిసింది. అయితే, ఇందులో వాల్తేరు డివిజన్ను లేదా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కలుపుతారా.. లేదా అనే విషయంపై స్పష్టత లేదు. కమిటీ ఇచ్చిన ప్రతికూల నివేదిక వల్లే ప్రత్యామ్నయంగా అమరావతిలో జోన్ ఏర్పాటు అంశం ప్రస్తావనకు వస్తున్నట్లు దిల్లీ వర్గాలు వూటంకిస్తున్నాయి. విశాఖ ప్రతినిధులు ‘జోన్ మనదే’ అనే అతి విశ్వాసాన్ని వదిలి.. తూర్పు కోస్తా రైల్వే వల్ల నగరానికి జరుగుతోన్న అన్యాయాన్ని పార్లమెంటులో గట్టిగా వినిపిస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. లేకుంటే, జోన్ జారుకోవడం ఖాయం.